కొత్త రూ.20 నోటును విడుదల చేయనున్న ఆర్బీఐ

  • మహాత్మా గాంధీ సిరీస్ లో నోటు
  • నోటుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం
  • ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల మిశ్రమంగా కొత్త నోటు
కొత్త ఇరవై రూపాయల నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్ లో ఈ నోటు ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ఈ నోటు వెలువడనున్నట్టు తెలిపింది. ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల మిశ్రమంగా ఈ కొత్త నోటు ఉన్నట్టు సమాచారం. కొత్త రూ.20 నోటుతో పాటు పాత నోట్లు కూడా చెల్లుతాయని, దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Go Back to Shorts
New currency
Rs.20
RBI
Governer
shakthi kant

More Telugu News